Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ఉత్తర సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ ప్రదేశాల్లో పి-8ఐ లాంగ్ రేంజ్ నిఘా విమానాలను మోహరించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంవీర్ సింగ్ తెలిపారు. అక్కడ 'యథాతథ స్థితి'ని మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలు భద్రతా పరిస్థితులను సంక్లిష్టంగా మార్చాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నేవీ డే సందర్భంగా మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ఆర్మీ, వాయుదళం అవసరాలకు అనుగుణంగా ఉత్తర సరిహద్దుల్లో పి-8ఐ నిఘా విమానాలను, మానవ రహిత వైమానిక వాహనం హెరోన్ను మోహరించామని తెలిపారు.