Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తన నెలవారి రిపోర్ట్లో పేర్కొంది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతం క్షీణించిందనీ.. సెప్టెంబర్ త్రైమాసికంలో కొంత రికవరీ అయి మైనస్ 7.5 శాతంగా చోటు చేసుకుందనీ.. ఇది వి ఆకార పద్దతిలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి నిదర్శనమని పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని.. లాక్డౌన్ తర్వాత ఆత్మనిర్భర్ లాంటి నిర్ణయాలు రికవరీకి దోహదం చేస్తున్నాయని పేర్కొంది.