Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారతదేశ ఎగుమతులు తగ్గాయి. నవంబర్ నెలలో 9.07 శాతం పడిపోయాయి. ఈ విధంగా ఎగుమతులు వరుసగా రెండో నెలా పడిపోవడం గమనార్హం. అయితే కోవిడ్-19 ప్రభావం కారణంగా మేజర్ మార్కెట్లపై ప్రభావం పడటంతో ఎగుమతులు తగ్గిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం.. కిందటేడాది నవంబర్ నెలలో ఎగుమతుల విలువ 25.77 బిలియన్ డాలర్లుగా(1.90 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. అయితే ఈ ఏడాది నవంబర్లో అది 23.43 బిలియన్ డాలర్లుగా ( దాదాపు 1.72 లక్షల కోట్లు) నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్లోనూ దేశ ఎగుమతులు 5.1శాతం పడిపోయాయి. సెప్టెంబర్ నెలలో ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్లోనే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. కానీ, ఆ తర్వాతి రెండు నెలలు ఎగుమతులు తగ్గాయి.