Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ పోరాటానికి అపూర్వ సంఘీభావం
- 5న మోడీ, అమిత్షా, అంబానీ, అదానీల దిష్టిబొమ్మల దహనం
న్యూఢిల్లీ : రైతాంగ పోరాటానికి సంఘీభా వంగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన రాస్తారోకోల్లో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఎడబ్ల్యూయూ, వివిధ ప్రజా సంఘాలు, ఏఐకేఎస్సీసీ భాగస్వామ్య పక్షాలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైనట్టు అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలె, ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో గురువారం ఉదయం నుంచి రహదారులన్నీ ప్రజాసంఘాల కార్యకర్తలతో, వారికి మద్దతుగా ప్రజలతో నిండిపోయాయి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన రోజు కూడా ఇదే కావడంతో బీజేపీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగానూ నిరసన సాగింది. ఈ నెల 2వ తేది రాత్రి కేరళవ్యాప్తంగా వందలాది గ్రామాల్లో వేలాదిమంది మంది కాగడాలతో ప్రదర్శనలు నిర్వహించారు. త్రిపురలో పెద్దఎత్తు న నిరసన ర్యాలీలు చేపట్టారు. జార్ఖండ్లోని ధన్బాద్లో డివైఎఫ్ఐ నాయకులు రైతు ఉద్యమానికి సంఘీభావంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమిళనాడులో 200కి పైగా కేంద్రాల్లో వరుసగా రెండో రోజూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. మహారాష్ట్రలో రైతులకు మద్దతుగా వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. రహ దారులను దిగ్బంధించారు. తెలంగాణాలో దాదాపు అన్ని జిల్లాల్లో నిరసన కార్యాచరణ సాగింది. తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి టి.సాగర్ తదితరులు అరెస్టయ్యారు. అసోంలో 21 జిల్లాల్లో రోడ్డురోకోలు, నిరసనలు సాగాయి. రాజస్థాన్లోని 25జిల్లా ల్లో ఆందోళనలు కొనసా గాయి. రైతులు, కార్మికులు, వ్యవ సాయ కూలీలు, విద్యా ర్థులు, యువత, మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొ న్నారు. జార్ఖండ్లో పలుచోట్ల నిరసన లు జరిగాయి. ఒడిషా లోని 14జిల్లాల్లో దాదాపు 50చోట్ల పోలీసులు లాఠీఛార్జి చేశారు. మధ్యప్రదేశ్లో రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యు డు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ తివారీపై పోలీసులు చేయి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ నుండి ఢిల్లీకి బయలుదేరిన దాదాపు వంద వాహనాలను పాల్వాల్ వద్ద పోలీసులు అడు ్డకున్నారు. చత్తీస్గఢ్లో 20 జిల్లాల్లో, బీహార్ వ్యాప్తంగా నిర సనలు కొనసాగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో చాలా చోట్ల ఆందోళనలు చేపట్టారు. గుజరాత్లో వరుసగా రెండో రోజూ నిరసనలు జరగగా, బెంగాల్, కర్నాటక, మరికొన్ని రాష్ట్రాల్లో వరుసగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరి హద్దుల్లో సంఘీభావ చర్యలు చేపట్టారు. పోరు కొనసాగి స్తున్న రైతాంగానికి ఆహారం, మందులు తీసుకుని చాలా మంది వచ్చారని అశోక్ ధావలె, హన్నన్ మొల్లాలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం కూడా నిరసన కొన సాగించాలని చాలా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ నెల 10 వరకూ కార్యాచరణ ఉండాలని భావించాయి. ఈ నెల 5న దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీల దిష్టిబొమ్మలు దహనం చేయడం, ధర్నాలు, ప్రదర్శనలు, ఇతర రకాల నిరసనలు కొనసాగిం చాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకుని వెళ్ళడం ద్వారా, బీజేపీ ప్రభు త్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు సాధ్యమైనంత విస్తృత స్థాయిలో ఐక్య ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఈ ప్రచారా న్ని, నిరసన కార్యాచరణను చేపట్టాలంటూ ఏఐకేఎస్ తన శాఖలకు పిలుపునిచ్చింది. ఎఐకెఎస్సిసి వర్కింగ్ గ్రూపు, పంజాబ్ కిసాన్ సంస్థల సమన్వయ కమిటీ, ఆర్కెఎంఎస్, వివిధ బీకేయూ గ్రూపుల మధ్య జరిగిన సంయుక్త సమా వేశంలో 5న ఆందోళనలపై నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
అన్నదాతలకు పలు సంస్థల మద్దతు
ఢిల్లీలో అన్నదాతల పోరాటానికి పలు సంఘాలు మద్దతు పలికాయి. ఐద్వా, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా మహిళా సంస్కృతిక్ సంఘటన్, ఎఎన్విఇఎస ్ఎఎన్, ఐఎన్ఎస్ఎఎఫ్, ఫైనాన్షియల్ అకౌంటబిలి టీ నెట్వర్క్, ఫోరమ్ ఫర్ ట్రేడ్ జస్టిస్, జన్వాడీ లేఖక్ సంఫ్ు, నేషన్ ఫర్ ఫార్మర్స్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్, పీపుల్స్ ఫస్ట్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, రైట్ టూ ఫుడ్ క్యాంపెయిన్, వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఐఎఫ్ఐస్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆ మూడు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. రైతులపై లాఠీలతో, జల ఫిరంగులతో దాడిని తీవ్రంగా ఖండించాయి. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక చట్టాలను రూపొం దించినట్లు స్పష్టమవుతుందని విమర్శించాయి.