Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబే హైకోర్టు
ముంబయి : ప్రజాకవి, బీమాకొరేగావ్ కేసులో అరెస్టుయిన వరవరరావు ఈ నెల 14 వరకూ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స కొనసాగించుకోవచ్చని బాంబే హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. 'ఆయన ఆరోగ్యం కొంత మెరుగైంది, కానీ ఈ నెల 14 వరకూ ఆస్పత్రిలో చికిత్స కొనసాగించుకోవచ్చు' జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్తో కూడిన ధర్మాసనం తెలిపింది. వరవరరావు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నానావతి ఆస్పత్రి అందచేసిన వైద్య నివేదికను ధర్మాసనం పరిశీలించింది. 'ఒక వ్యక్తి మరణశయ్యపై ఉండగా, అతను జైలులో చికిత్స పొందుతాడని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకూడదు' అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 14కు విచారణను వాయిదా వేసింది. హైకోర్టు జోక్యంతోనే నవంబర్ 18న వరవరరావును నానావతి ఆస్పత్రికి తరలించారు.