Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరిలో రజనీ రాజకీయ అరంగేట్రం
చెన్నై: రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై నెల కొన్న సందిగ్ధతకు తెరపడింది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టను న్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రజనీ ప్రకటిం చారు. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తాననీ, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని వెల్లడించారు. ''త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు'' అని రజనీకాంత్ ట్విటర్లో పేర్కొన్నారు. రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన కొద్ది రోజులకే రజనీ ఈ ప్రకటన చేశారు. గత సోమవారం రజనీ మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమైన విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వీలైనంత త్వరగా పార్టీని స్థాపించాలని కార్యదర్శులు రజనీని కోరారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీ రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అన్నట్లుగానే ఈ కీలక ప్రకటన చేశారు. రజనీ రాకపై స్పష్టత రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.