Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీరేట్లు యథాతథం
- కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీల పరిమితి 5వేలకు పెంపు
- ఆర్బీఐ కీలక నిర్ణయాలు..
న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం అమాంతం పెరగడంతో పాటుగా జీడీపీ మైనస్లో కొనసాగ డంతో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 4శాతం వద్దే కొన సాగించాలని నిర్ణయించింది. రివర్స్ రెపో రేటు ను 3.35 శాతం వద్దే ఉంచింది. మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష కీలక నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. నెట్ బ్యాం కింగ్ బదిలీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డ్ పేమెంట్స్ వంటి డిజిటల్ లావాదేవీలకు సంబంధించి మరింత భద్రత చేకూరేలా నూతన నిబంధనలను రూపొందిస్తున్నామన్నారు. కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీల పరిమితిని జనవరి ఒకటి నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ మైనస్ 7.5 శాతానికి పడిపోనుందని అంచనా వేశారు.