Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశరాజధానికి కేరళ రైతుల పయనం
- వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనకు సంఘీభావం
- 21న ఢిల్లీకి మరో రైతు బృందం.. 26 కిసాన్ ట్రాక్టర్ ర్యాలీకి భారీ సన్నాహాలు
తిరువనంతపురం: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృ త్వంలోని బీజేపీ సర్కారు ఇటీవల తీసువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆం దోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులో నిరసన కార్యక్రమాలు చేపట్టిన అన్నదాతలకు సర్వత్రా మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన రైతన్నలు కూడా ఢిల్లీ సరిహద్దులో నిరసనలు తెలుపుతున్న వారికి అండగా అక్కడికి పయనమయ్యారు. ఇప్పటికే పలువురు రాష్ట్ర రైతులు దేశారాజధాని సరిహద్దులో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని కేరళ కర్షక సంఘం (అఖిల భారత రైతు సంఘం) అధ్వర్యంలో 500 మందికి పైగా అన్నదాతలు సోమవారం ఉదయం కన్నూరు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నెల 26న అన్నదాతలు చేపట్టనున్న 'కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ'కి భారీ సన్నాహాలు సైతం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పలువురు రైతులు కన్నూరులో సమావేశమై.. సోమవారం ఉదయం ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు ఎస్.రామచంద్రన్ పైలారుతో కలిసి ఈ ఢిల్లీ యాత్రను ప్రారంభించారు.
ఇప్పటికే పలువురు రైతులు ఢిల్లీ చేరగా.. తాజాగా 500 వందల మందకి పైగా రైతులు రాజధానికి వెళ్తున్నారు. అలాగే, ఈ నెల 21న మరో రైతు బృందం కూడా అక్కడి బయలుదేరనుందని కేరళ కర్షక సంఘం కార్యదర్శి ఎన్.బాలగోపాల్ మీడియాకు వెల్లడించారు. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ ఐదు సరిహద్దులలో ఒకటైన షాజహాన్పూర్ సరిహద్దు వద్ద కేరళ రైతులు నిరసనలో పాల్గొంటారని తెలిపారు.
ఇదిలా ఉండగా, కేరళ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తీవ్రతరమయ్యాయి. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ)లో భాగమైన కేరళ సంయుక్త కర్షక సమితి.. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా డిసెంబర్ 12 నుంచి తిరువనంతపురంలోని అమరవీరుల స్థూపం వద్ధ రిలే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో కార్మిక సంఘాలు, మహిళలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థి, యువజన సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కేరళలో ఉన్న అన్ని రైతు సంఘాలు కూడా దీనికి మద్దతు ప్రకటించాయి.