Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిపబ్లిక్ డే వరకూ మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద బర్డ్ఫ్లూ కేసులు కలకలం రేగడంతో ఈనెల 26 రిపబ్లిక్ డే వరకూ ఇక్కడికి ప్రజలు రాకుండా అధికారులు నిషేధం విధించారు. ఇటీవల ఇక్కడ మరణించిన 15 కాకుల శాంపిళ్లను జలంధర్, భోపాల్ ల్యాబ్స్లో పరీక్షించారు. వాటి ఫలితాలు పాజిటివ్గా వచ్చాయి. దీంతో టూరిస్టులు, స్థానిక ప్రజలను బర్డ్ఫ్లూ నుండి రక్షించేందుకు అధికారులు రక్షణా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఎర్రకోటను ఈనెల 26 వరకు మూసేస్తున్నట్లు అధికారుళష్ట్ర ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ను అధికారులు మూసేశారు. ఇక్కడి కోళ్లకు చెందిన శాంపిళ్లను భోపాల్లో పరీక్షించగా నెగిటివ్ వచ్చింది. మరోవైపు దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లోని కోళ్లు, బాతులను చంపేస్తున్నారు. బర్డ్ఫ్లూ వల్ల వచ్చే సమస్యలపై ఆయా ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలూ చేపడుతున్నాయి.