Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వాట్సప్' సీఈఓకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ : ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సప్కు చెందిన వివాదాస్పద 'ప్రైవసీ పాలసీ'పై కేంద్రం స్పందించింది. ఈ మేరకు వాట్సప్ సీఈఓ విల్ కాథ్కార్ట్ ఘాటైన లేఖను రాసింది. సంస్థ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీలోని మార్పులను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొన్నది. ఏకపక్ష మార్పులను తీసుకురావడం శ్రేయస్కరం కాదనీ, ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని వివరించింది. అత్యధిక మంది వినియోగదారులతో అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశాలలో భారత్ ఒకటన్న విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రం గుర్తు చేసింది. వాట్సప్ తన సర్వీసు నిబంధనలు, ప్రైవసీ పాలసీలో తీసుకొచ్చిన మార్పులతో ప్రజలలో ఆందోళనలు రేకెత్తాయని పేర్కొన్నది. సమాచార గోప్యత, నిర్ణయ స్వేచ్ఛ, డేటా సెక్యూరిటీ విషయంలో వాట్సప్ తన ప్రతిపాద మార్పులను పున:సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. భారతీయులకు తగిన గౌరవం లభించాలని పేర్కొన్నది. కాగా, వాట్సప్ తన కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురావడంతో ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులు ప్రత్యర్థి యాప్ల వైపు దృష్టి సారించడంతో వాట్సప్ తన నిర్ణయాన్ని మూడు నెలలు వాయిదా వేసుకున్నది.