Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర పోలీస్ హెడ్క్వార్టర్స్ ఎదుట సీపీఐ(ఎం) ఆందోళన
అగర్తల : త్రిపురలో కాషాయ గూండాల హింసాకాండను వ్యతిరేకిస్తూ మంగళవారం రాజథాని అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ ఎదుట సీపీఐ(ఎం) ఆందోళనకు దిగింది. సుమారు గంటర్నసేపు ఆందోళన జరగ్గా, తరువాత పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. తమ కార్యకర్తలపై దాడికి కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) నేతలు డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు ఇంతవరకూ ఎలాంటి చర్యా తీసుకోలేకపోయారనీ, అందుకే పోలీస్ హెడ్క్వార్టర్స్ వద్ద ఆందోళనకు దిగాల్సి వచ్చిందని సీపీఐ(ఎం) తెలిపింది. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కమిటీ కార్యదర్శి గౌతం దాస్, సీపీఐ(ఎం) సెంట్రల్ కమిటీ సభ్యులు బిజన్ ధార్, రమాదాస్, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు మాణిక్, కార్యకర్తలు పాల్గొ న్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడుల అంశంపై జోక్యం చేసుకోవాలని సోమవారం మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు గవర్నర్ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఉపరాష్ట్రపతికి జర్నదాస్ లేఖ
బీజేపీ గూండాల దాడిపై త్రిపురకు చెందిన సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యురాలు జర్నదాస్ బైద్య ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకి లేఖ రాసారు. ఈ నెల 17న తన ఇంటి పైన దాడి చేయడంతో పాటు తన గన్మెన్పై హత్యా యత్నం చేసినట్టు జర్నదాస్ లేఖలో వివరించారు. ఈ నెల 17న బధర్ఘట్ వద్దనున్న పార్టీ కార్యాలయంలో సమావేశమైన సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడి చేశారనే విషయం తెలిసి, పోలీస్స్టేషన్కు వెళ్తుతున్న తనపై బీజేపీ గూండాలు దాడి చేశారని, తన గన్మెన్ ప్రియాంతదాస్పై హత్యాయత్నంకు దిగారని తెలిపారు. అదే రోజు సాయంత్రం తన ఇంటిపైనా దాడి చేశారని, సామాగ్రిని ధ్వంసం చేశారని లేఖలో జర్నదాస్ వివరించారు.