Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూరత్ లో ఫుట్పాత్పైకి దూసుకెళ్లిన లారీ
- 15 మంది వలస కార్మికుల దుర్మరణం
సూరత్ : గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ను పై నిద్రిస్తున్న వలస కార్మికులను లారీ రూపంలో మృత్యువు బలితీసుకుంది. మంగళవారం వేకువజామున జరిగిన ఈ ఘటనలో 15 మంది వలస కార్మికులు చనిపోయారు. వీరిలో 8 మంది మహిళలు, పన్నెండు మాసాల ఓ చిన్నారి ఉన్నారు. మరణించివవారిలో ఒక్కరు మినహా మిగతా వారంతా రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాకు చెందినవారు. మధ్య ప్రదేశ్కు చెందిన 19 ఏండ్ల వలస కూలీ కూడా మృతుల్లో ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర దుర్ఘటన సూరత్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని కోసాంబా పట్టణంలో జరిగింది. జిల్లా ఎస్పి ఉషా రాధ తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో కోసాంబా లోని ఒక ప్రధాన కూడలి నుంచి మాండ్వి వైపు వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా చెరకు లోడ్తో వస్తున్న ట్రాక్టర్ను ఢకొీట్టడంతో, వాహనంపై డ్రైవర్ అదు పు కోల్పోయాడు. ఆ సమయానికి ఫుట్పాత్పై 18 మంది భవన నిర్మాణ కార్మికులు నిద్రిస్తున్నారు. వీరిలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.