Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ''మూడు కొత్త చట్టాలతో మోడీ ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని ముగ్గురు లేదా నలుగురు స్నేహితులైన పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టింది'' అని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన బుక్లెట్ను మంగళవారం ఢిల్లీలో రాహుల్గాంధీ విడుదల చేశారు. మోడీ ప్రభుత్వానికి గాని, ఎవరికైనా భయపడేది లేదని, వారు తనను కాల్చగలరు, కాని టచ్ చేయలేరని అన్నారు. రైతుల ఆందోళనకు వంద శాతం మద్దతిస్తున్నానని, అదేవిధంగా దేశంలోని ప్రతిఒక్కరూ రైతుల ఆందోళనకు మద్దతునివ్వాలని అన్నారు. రైతులు భావితరాలకోసం, మనకోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్ .. బీజేపీ జాతీయ కార్యదర్శి నడ్డాపై కూడా మండిపడ్డారు. ''నడ్డా ఎవరు, ఆయనకు నేనేందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.