Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 30న ప్రధాని మోడీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు అహ్వానాలు పంపుతామని మంత్రి చెప్పారు. బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వ శాసన అజెండాను వివరించడానికి, ప్రతిపక్షాల సలహాలను వినడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.