Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయంపై చట్టం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు : ఏఐకేఎస్సీసీ స్పష్టం
- అన్నదాతలకు మద్దతుగా ఫిబ్రవరి 3న విద్యుత్ కార్మికుల సమ్మె
న్యూఢిల్లీ : రైతులతో చర్చకు ప్రధాని మోడీ ఎందుకు దూరంగా ఉంటున్నారని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) ప్రశ్నించింది. ఈ మేరకు ఏఐకేఎస్సీసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది. రైతులు భూమిపై రాజీపడలేరనీ, వ్యవసాయంపై చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదని స్పష్టం చేసింది. కలకత్తాలో మహా పాదయాత్ర మొదలైందనీ, వేలాది మంది పగలు, రాత్రి పోరాటాలకు హాజరవుతున్నారని పేర్కొంది. ముంబయి, హైదరాబాద్, విజయవాడ, త్రివనాథపురం, భువనేశ్వర్, భోపాల్లలో రాబోయే రోజుల్లో 'మహాపడావ్' జరుగుతుందని పేర్కొంది. రైతుల ఆందోళనలకు మద్దతుగా ఫిబ్రవరి 3న విద్యుత్ కార్మికుల అఖిల భారత సమ్మె జరగనున్నదని తెలిపింది. జనవరి 22న ఏఐకేఎస్సీసీ, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల సంయుక్త సమావేశం జరగనున్నట్టు పేర్కొంది.
56 రోజు కొనసాగిన రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారం 56వ రోజుకు చేరింది. కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది రైతులు ఉద్యమంలో భాగస్వామ్యమవుతున్నారు.