Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ సామ్సంగ్ తన అత్యాధునిక గెలాక్సి ఎస్21 సిరీస్కు ప్రీ-బుకింగ్ ప్రారంభించినట్లు తెలిపింది. గెలాక్సి ఎస్21 అల్ట్రా అత్యంత మెరుగైన ప్రో-గ్రేడ్ కెమెరా సిస్టమ్, సామ్సంగ్కు చెందిన అత్యంత ఉజ్వల, అత్యంత నాజూకు డిస్ప్లేతో అందుబాటులోకి తెస్తోన్నట్లు పేర్కొంది. గెలాక్సి ఎస్21 అల్ట్రా క్వాడ్ రియర్ కెమెరాను కలిగి ఉండగా, ఇది అప్గ్రేడ్ అయిన 108 ఎంపి ప్రో సెన్సర్ మరియు 100 ఎక్స్ స్పేస్ జూమ్తో దాన్ని మొట్టమొదటి డ్యూయల్ టెలీ-లెన్స్ సిస్టమ్తో సామ్సంగ్ తయారు చేసింది. గెలాక్సి ఎస్ 21 అల్ట్రా 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. గెలాక్సి ఎస్ 21ను సరళమైన డిజైన్ మరియు సాంద్రత కలిగిన 6.2 అంగుళాల డిస్ప్లేను కోరుకునే వారిని దష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. గెలాక్సి ఎస్21 విస్తతమైన 6.7 అంగుళాల డిస్ప్ల మరియు పెద్ద బ్యాటరీ కలిగి ఉండగా, గేమర్లకు మరియు బించ్ వీక్షకులకు పరిపూర్ణమైన ఉపకరణం కానుందని ఆ కంపెనీ తెలిపింది.
భారతదేశంలో గెలాక్సి ఎస్21 సిరీస్ ధర
గెలాక్సి ఎస్21 (8జిబి+ 128జిబి) రూ.69,999 (ఫ్యాంటమ్ వైలెట్, వైట్, పింక్, గ్రే)
గెలాక్సి ఎస్21 (8జిబి+ 256జిబి) రూ.73,999 (ఫ్యాంటమ్ వైలెట్, వైట్, గ్రే)
గెలాక్సి ఎస్21+ (8జిబి +128జిబి) రూ.81,999 (ఫ్యాంటమ్ వైలెట్, సిల్వర్, బ్లాక్)
గెలాక్సి ఎస్21+ (8జిబి+ 256జిబి) రూ.85,999 (ఫ్యాంటమ్ వైలెట్, సిల్వర్, బ్లాక్)
గెలాక్సి ఎస్21 అల్ట్రా (12 జిబి+ 256జిబి) రూ.1,05,999 (ఫ్యాంటమ్ బ్లాక్, సిల్వర్)
గెలాక్సి ఎస్21 అల్ట్రా (16జిబి +512జిబి) రూ.1,16,999 (ఫ్యాంటమ్ బ్లాక్)