Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఎజి పెరారివలన్ క్షమాభిక్ష కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షకు సిఫార్సు చేసినా రాష్ట్ర గవర్నర్ ఏళ్ల తరబడి దీనిని జాప్యం చేయడం అసాధారణమని వ్యాఖ్యానించింది. 'ప్రభుత్వం దీనిని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కానీ గవర్నర్ ఆలస్యం చేస్తున్నారు. ఇది అసాధారణమైన సమస్య' అని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని ముగ్గురు జడ్జీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదిస్తూ పెరారివలన్ క్షమాభిక్ష కోసం గవర్నర్ వద్దకు కాకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని సూచించారు. దీనిని పెరారివలన్ తరుపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణ ఖండించారు. 70 ఏళ్ల నుంచి గవర్నర్కు క్షమాభిక్ష విజ్ఞప్తులు వెళుతున్నాయని గుర్తుచేశారు. ఈ కేసులో ప్రతి ఐదేళ్లకు కేంద్రం ఒక కొత్త వాదనను తీసుకొస్తుందని విమర్శించారు.