Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో స్థానంలో తెలంగాణ
- కర్నాటక నెంబర్ 1.. :నిటి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులు విడుదల
- ఏడో స్థానంలోకి ఎగబాకిన ఏపీ
న్యూఢిల్లీ : దేశప్రగతిలో నూతన ఆవిష్కరణలను తెలిపే ఇన్నోవేషన్ ఇండెక్స్-2020ని నిటి ఆయోగ్ విడుదల చేసింది. ప్రపంచ ఆవిష్కరణల సూచీ తరహాలో రూపొందించిన ఈ సూచీని నిటి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు బుధవారం విడుదల చేశారు. ఈ ఇండెక్స్లో గతేడాదిలాగే తెలంగాణ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకోగా... కేరళ ఆరు నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. పదోస్థానంలో ఉన్న ఏపీ మెరుగుపడి ఏడో స్థానంలోకి వచ్చింది. అయితే మళ్లీ కర్నాటక తొలి ర్యాంక్లోనే నిలిచింది.
దేశంలోని 17 పెద్ద రాష్ట్రాలు / 10 ఈశాన్య రాష్ట్రాలు / 9 కేంద్రపాలిత, సిటీ స్టేట్స్గా విభజించి వాటి పనితీరు ఆధారంగా ఈ ఇండెక్స్ను రూపొందించింది. 17 పెద్ద రాష్ట్రాల జాబితాలో కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ, పంజాబ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్లు నిలిచాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్ప్రదేశ్ తొలి ర్యాంక్లో నిలవగా.. కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వడంలో ఆయా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు, తమ బలాలతోపాటు లోటుపాట్లను సరిచేసుకొని కొత్త ఆవిష్కరణల దిశగా వెళ్లడం తదితర అంశాల్లో వచ్చిన సగటు స్కోరు ఆధారంగా ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ను రూపొందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మెరుగైన ర్యాంకులు ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.