Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనుకావటంతో.. ఇప్ప టికే రాంచీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గత మూడు రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. జైలు అధికారుల సమాచారం మేరకు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, రబ్రీదేవి శుక్రవారం రాత్రి రాంచీ చేరుకుని ఆయన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి మెరుగైన ఆరోగ్యం అందించాలని తేజస్వీ యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ను కోరారు. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు శనివారం తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, మెరగైన వైద్యం కోసం ఢిల్లీ తరలిస్తున్నామని వైద్యులు తెలిపారు.