Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2020-21కి సంబంధించిన బడ్జెట్ ప్రింటింగ్ కసరత్తును శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంచనంగా ప్రారంభించారు. ప్రతీ ఏడాది ఎప్పటిలాగే హల్వా తయారు చేసి ఈ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ నార్త్ బ్లాక్లో జరిగే ఈ బడ్జెట్ కసరత్తు సమయంలో ఎంపిక చేసిన ఉన్నతాధికారులు మినహా ఎవరినీ లోనికి, బయటికి పంపించరు. ఇందులో పాల్గొన్న అధికారులను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే ఇంటికి అనుమతిస్తారు. హల్వా కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సిన్హా సహా ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆ వివరాలను ఈ సారి 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' ద్వారా అందుబాటులో ఉంచనున్నారు.