Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో రాహుల్ వ్యాఖ్యలు
కోయంబత్తూరు : తమిళులను రెండో తరగతి పౌరులుగా మోడీ ప్రభుత్వం చూస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతి భాష, సంస్కృతి వృద్ధి చెందాలని కాంగ్రెస్ కోరుకుంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు నూతన ఆలోచనా విధానం, నూతన ప్రభుత్వం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, పారిశ్రామికీకరణలో మిగిలిన దేశానికి మార్గాన్ని చూపిన తమిళనాడు ఇప్పుడు వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం నుంచి యావత్ దేశం నేర్చుకోవాల్సింది చాలా వుందన్నారు. తమిళ ప్రజలకు అవసరమైన ప్రభుత్వాన్ని అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని చెప్పారు. ముగ్గురు, నలుగురు పారిశ్రామికవేత్తల సంక్షేమం గురించే మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు.