Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న వందలాది మంది అన్నదాతలు
లక్నో : వివాదాస్ప వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో వందలాది మంది రైతులు రాజ్భవన్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ), సంయుక్త్ కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్భవన్కు చేరుకోవడానికి లక్నో శివారులోని గోసారుగంజ్ ప్రాంతంలో అన్నదాతలు సమావేశమయ్యారు. అనంతరం గవర్నర్ అదనపు ప్రధాన కార్యదర్శి, హౌంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, లక్నో పోలీసు కమిషనర్కు మెమోరాండంను అందించినట్టు బీకేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరినామ్ సింగ్ వర్మ తెలిపారు. గోసారుగంజ్లోని కబీర్పూర్ వద్ద దాదాపు 8వేల మందికి పైగా రైతులు, వందలాది ట్రాక్టర్లతో హజరయ్యారని చెప్పారు. ఈనెల 26న రైతులు నిర్వహించబోయే ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనేందుకు తాను ఢిల్లీకి వెళ్తున్నానీ, ఢిల్లీకి రాలేని వారు అలాంటి ర్యాలీలను తమ మండలాల్లో నిర్వస్తారని తెలిపారు. ''మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు మా ప్రధాన డిమాండ్. అలాగే, చెరుకు బకాయిలు, ఎంఎస్పీకి ఉత్పత్తిని కొనుగోలు చేయకపోవడం వంటివి కూడా మా డిమాండ్లలో ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుత్ను 'నిరసనలు' పంజాబ్, హర్యానాలో మాత్రమే జరుగుతున్నాయనీ, యూపీలో కావని సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. మా బలంతో ఆయనకు సమాధానం చెప్పాలనుకున్నాం. మా ఆందోళనల్లో కొందరే పాల్గొన్నారని వారు (ప్రభుత్వం) అనుకుంటే, వారు మా ఆందోళనను అడ్డుకోవడానికి ప్రయత్నించేవారు కాదు'' అని వర్మ చెప్పారు.