Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు విచారణకు రానున్న ఏపీ పంచాయతీ పిటిషన్
న్యూఢిల్లీ :ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నేడు (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుండటంతో అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తోందోనన్న ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. వ్యాక్సినేషన్తో పాటే పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన నోటీస్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, అది విచారణకు రాకముందే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి)నోటిఫికేషన్ విడుదల చేయడం వంటి పరిణామాలు తెలిసిందే. ఎస్ఇసి చర్యలను సవాల్ చేస్తూ ఉద్యోగసంఘాలు కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి. మరోవైపు తమ వాదన వినకుండా తీర్పు ఇయ్యవద్దని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కేవియట్ను ఇప్పటికే దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.