Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోస్ కుమార్తె అనిత
కోల్కతా : ప్రముఖ భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశంలో అన్ని విశ్వాసాలను గౌరవించారని ఆయన కూతురు అనిత అన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. '' ఆయన ఇతర మతాల పట్ల సహనంతో వ్యవహరించారు. ఇతర మతాలను గౌరవించేలా ఆయన భారత జాతీయ ఆర్మీ సభ్యులను, తన స్నేహితులు, కుటుంబాన్ని, అనుచరులను ప్రేరేపించారు'' అని ఒక వీడియో సందేశాన్ని ఆమె మ్యునిచ్లోని ఇండియన్ కాన్సులేట్ అధికార ట్విట్టర్ హ్యాడిల్లో పోస్ట్ చేశారు. ఐకమత్యం, సహనం వంటి ఆదర్శాలను ఆయన తన జీవితాంతం సమర్థించారని చెప్పారు. నేతాజీ ఆలోచనలు, ఆదర్శల నుంచి మనం ప్రేరణ పొందాలని తాను ఆశిస్తున్నట్టు వివరించారు.