Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి మహిళా ఆర్మీ అధికారులు
- శాశ్వత కమిషన్, ప్రమోషన్లు, ప్రయోజనాలపై కోర్టుకు
న్యూఢిల్లీ : శాశ్వత కమిషన్ ఏర్పాటుకు అనుమతి, ప్రమోషన్లు, ప్రయోజనాల విషయంలో మహిళా ఆర్మీ అధికారులు మరోసారి భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ను వేశారు. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ అశుయాదవ్తో పాటు మరో పది మంది మహిళా ఆర్మీ అధికారులు ఉన్నారు. ఈ విషయంలో గత ఫిబ్రవరిలో న్యాయస్థానం కేంద్రానికి ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కోరుతూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలుకు నోచుకోలేదని పిటిషన్లో మహిళా అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరి 17 సుప్రీంకోర్టు కేంద్రం వైఖరిని తిరస్కరిస్తూ మహిళా ఆర్మీ అధికారుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు గ్రీన్ సిగల్ ఇస్తూ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం మాత్రం న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యమం వహించింది. దీంతో సదరు మహిళా అధికారులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ పిటిషన్ విచారణ ఈనెల 27న న్యాయస్థానం చేపట్టనున్నది. జస్టిస్ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలను విననున్నది.