Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జీఎస్టీ విధానంతో పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. తాజాగా మరో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది డిసెంబర్లో విడుదల చేయగా ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిహారం అందించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 3,174.15 కోట్లు కేంద్ర ఆర్థిక మంత్రత్వ శాఖ సోమవారం మరో విడత పరిహారం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.1,336.44 కోట్లు విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్కు రూ.1,810.71 కోట్లు విడుదలయ్యాయి. జీఎస్టీ పరిహారం విషయమై రాష్ట్రాలు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రులను కలిసి విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం విడుతల వారీగా జీఎస్టీ పరిహారం విడుదల చేస్తోంది.