Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఇప్పటికే తూర్పు లద్దాఖ్ వివాదంతో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల ప్రకారం.. మరోసారి చైనా సైనికులు హద్దుమీరి భారత్లోకి చోచ్చుకురావడానికి ప్రయత్నించారు. ఈ చర్యను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలోని నకులా సరిహద్దుల్లో గత వారంలో చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా చైనా సైనికులు గాయపడినట్టు తెలిపాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో ఇప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, అక్కడి కమాండర్ల జోక్యంతో ఈ సమస్య ఇదివరకే పరిష్కారమైందని వెల్లడించాయి. కాగా.. తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభనపై రండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం గమనార్హం.