Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకమౌతున్న కర్షకులు, కార్మికులు
- గట్టి సంకల్పంతో రైతాంగ ఉద్యమం : కిసాన్ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాల సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాలను రక్షించుకునేందుకు కార్మికులు, కర్షకులు ఏకమవుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నూతన వ్యవసాయ చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు, కార్పొరేట్ల లూటీకి అనుగుణంగా దేశ ఆస్తుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకుల మధ్య పెరుగుతున్న ఐక్యత చారిత్రాత్మకమైనదని సోమవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అకుంఠిత దీక్షతో పోరు సాగిస్తున్న రైతులు, రైతు సంఘాలను సంయుక్త సంఘర్ష్ మోర్చా, కార్మిక సంఘాలు అభినందనలు తెలియచేశారు.
ఈ నెల 22వ తేదిన కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక, రైతుల సంయుక్త సంఘర్ష్ మోర్చా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ ఆందోళనలో అశువులు బాసిన రైతులకు సమావేశం నివాళులు అర్పించింది. రైతాంగ ఆందోళనలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఉద్యమంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులకు ఎన్ఐఎ, ఈడి, ఆదాయపన్ను శాఖలను వినియోంచి నోటీసులు ఇవ్వడం, వారిపై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని సమావేశం ఖండించింది. రైతులకు అన్ని వర్గాల నుంచి వస్తున్న విసృత మద్దతు దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ట్రిక్కులను ఉపయోగించడం మానుకొని చట్టాలను వెంటనే రద్దు చేయాలని కిసాన్ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాలు ఉమ్మడిగా డిమాండ్ చేశాయి. కార్మిక సంఘాలైన సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి, హెంఎంఎస్, ఎఐయుటియుసి, టియుసిసి, ఎఐసిసిటియు, యుటియుసి, ఎస్ఇడబ్ల్యుఎ, ఎల్పిఎఫ్, అఖిల భారత కిసాన్ సభ ప్రతినిధులు ప్రకటన జారీ చేశారు.