Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరూర్ (తమిళనాడు) : ప్రధాని మోడీ ద్వారానే బాలాకోట్పై భారత సేనల దాడుల ముందస్తు సమాచారం రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోసామికి చేరిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ దాడుల ముందస్తు సమాచారం ప్రధాని, రక్షణ మంత్రితో సహా కేవలం ఐదుగురు వ్యక్తులకు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. అయితే, బాలాకోట్ దాడులకు మూడో రోజుల ముందే ఈ దాడులు సమాచారం తనకు తెలిసిందని అర్నబ్ ప్రకటించారనీ, ఇది భారత వాయుసేనల పైలట్ల జీవితాలను ప్రమాదంలో పెట్టడమేనని రాహుల్ విమర్శించారు. ప్రధాని చెప్పడం కారణంగానే అర్నబ్కు ఈ అంశంపై విచారణ జరపడం లేదనే విషయం తనకు అర్థమవుతుందని రాహుల్ తెలిపారు. ఎన్నికల జరగనున్న తమిళనాడులోని కరూర్లో రోడ్ షోలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.