Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బాల శక్తి పురస్కార్ విజేతలతో ప్రధాని మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్బంగా ఆయన వారిని ప్రశింసించారు. అలాగే పనిచేయడాన్ని ఎప్పుడూ అపవద్దని, వినయంగా ఉండాలని వారికి సూచించారు. ప్రముఖల జీవిత చరిత్రలు చదవాలని, వాటికి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నానికి చెందిన అమేయ లగుడుతో సహా 32 మంది చిన్నారులు 2021 ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల అమేయ ఫోటోను ప్రధాని ట్వీట్ చేశారు. భరతనాట్యం, కుచిపూడిలో తన సామర్థ్యంతో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అమేయ గెలుచుకుందని ప్రశంసించారు. సానుకూలంగా ముగిసిన
భారత్, చైనా చర్చలు
బలగాల ఉపసంహరణకు అంగీకారం
న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య జరిగిన 9వ దఫా చర్చలు సానుకూలంగా, ఆచరణాత్మకంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని కేంద్రం సోమవారం ఒక ప్రకనటలో తెలిపింది. దాదాపు 9 మాసాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే లక్ష్యంతో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు 15 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు వెంబడి బలగాలను త్వరగా ఉపసంహరించేందుకు ఇరు పక్షాల సైనిక కమాండర్లు అంగీకరించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మోల్డో-చుషూల్ సరిహద్దు కలిసే పాయింట్ వద్ద ఈ సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ పొడవునా పరిస్థితిని స్థిరీకరించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది.
సిక్కింలో భారత్, చైనాల దళాల ఘర్షణ!
ఈ నెల 20న సిక్కింలోని నకులా సరిహద్దు ప్రాంతంలో భారత్, చైనా దళాలు చిన్నపాటి ఘర్షణకు దిగాయని, ఈ సమస్యలను నిబంధనల ప్రకారం స్థానిక కమాండర్లు పరిష్కరించారని భారత సైన్యం సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించి అవాస్తవ కథనాలకు దూరం గా ఉండాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఆర్మీ తన ప్రకటనలో తెలిపింది.