Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి
న్యూఢిల్లీ : భారత దేశం శాంతికి కట్టుబడి ఉన్నదనీ, అయితే జాతీయ భద్రతను అణగదొక్కడానికి ప్రయత్నాలను నిరోధించడానికి దేశ సైనిక దళాలు సరైన సమన్వయంతో సమీకరించబడతాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రికత్తల నేపథ్యంలో కోవింద్ ఈ వాఖ్యలు చేశారు. మంగళవారం నాడు జరుపుకునే 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించిన ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ ప్రయోజనాలు రక్షించబడతాయనని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నూతన వ్యవసాయ చట్టాల గురించి కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. నూతన చట్టాలపై రైతుల భయాలను తొలగించాలని తెలిపారు. కరోనాపై పోరాటం గురించి మాట్లాడుతూ దేశంలో ప్రజల మధ్య సోదరభావం లేకపోతే మహమ్మారిపై ప్రతిభావంతమైన ప్రతిస్పందన కనబర్చలేమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఔషధాలు సరఫరా చేస్తున్న భారత్ 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'గా పిలుస్తున్నందకు గర్వంగా ఉందని తెలిపారు. భారత్ ఇప్పుడు నిరాశతో కాకుండా నమ్మకంగా ఉందని చెప్పారు. గత జూన్లో గాల్వాన్ వ్యాలీలో మరణించిన 20 మంది భారత సైనికులకు నివాళులర్పించారు. ధైర్యమైన సైనికులకు దేశం కృతజ్ఞతలు తెలుపుతుందని రాష్ట్రపతి తెలిపారు.