Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట
  • ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..
  • కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్‌ ప్రభుత్వం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

Tue 23 Feb 02:05:27.181728 2021

- బలనిరూపణలో సీఎం విఫలం... రాజీనామా
- కేంద్రం కుట్రే: నారాయణస్వామి
న్యూఢిల్లీ : పుదుచ్చేరిలో ఊహించిందే జరిగింది. బలనిరూపణలో నారాయణస్వామి సర్కార్‌ విఫలమైంది. దాంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. బలపరీక్ష కోసం పుదుచ్చేరి శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై ఓటింగ్‌ జరగకముందే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్‌ వి.పి.శివకొలుందు ప్రకటించారు. మరోవైపు సీఎం తన పదవికి రాజీనామా చేసేందుకు శాసనసభ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు బయల్దేరారు. అక్కడ ఎల్జీ తమిళసైని కలిసి తన రాజీనామా అందజేసినట్టు నారాయణస్వామి ప్రకటించారు. ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు సహా 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం 26 మంది ఉన్నారు. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్‌ కూటమి బలం 12కి తగ్గింది. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 10 (స్పీకర్‌తో కలిపి), డీఎంకే నుంచి ఇద్దరు
ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి బలం 14 (ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు )గా ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా కిరణ్‌బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించి, తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన తమిళసై..నారాయణస్వామి ప్రభుత్వం సోమవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
కేంద్రం కుట్ర ఇది : సీఎం నారాయణస్వామి
డీఎంకే మద్దతుతో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. ఆ తర్వాత ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఉప ఎన్నికల్లోనూ గెలిచాం. పుదుచ్చేరి ప్రజలకు మాపై నమ్మకం ఉందని ఆ ఎన్నికలు నిరూపించాయి. అయితే మాజీ ఎల్జీ కిరణ్‌బేడీ, కేంద్ర ప్రభుత్వం..ప్రతిపక్షంతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నోసార్లు మేం నిధులు అడిగినా కేంద్రం మంజూరు చేయలేదు. ప్రభుత్వ కార్యకలాపాలను కిరణ్‌ బేడీ అడ్డుకున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం
ముగిసిన స్పెక్ట్రం వేలం
రైతుల నిరసనలకు మా మద్దతు
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
మాజీ డీజీపీ రాజేశ్‌ దాస్‌ పై
తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు
బీహార్‌లో ఖాకీ కన్నెర్ర..
ప్రధాని మోడీకి టీకా
బాబు బైటాయింపు
కార్పొరేట్లకోసమే...
చౌక వడ్డీకే గృహ రుణం
ప్రయివేటు పెట్టుబడులు డీలా : ఆర్‌బిఐ రిపోర్ట్‌
కరోనా ముప్పు పోలేదు
ఎం.కృష్ణన్‌ కన్నుమూత
మాజీ ఉద్యోగుల పనే !
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.