Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదనీ, కోవిడ్-19 నిబంధనలు పాటించకపోతే మూడో దఫా (థర్డ్ వేవ్) ప్రమాదం పొంచివున్నదని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండిస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ శేఖర్ సి.మండే స్పష్టంచేశారు. కరోనా వైరస్ కట్టడిని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు అన్ని వ్యవస్థలూ కలిసికట్టుగా పోరాడాలని సీఎస్ఐఆర్ డీజీ అభిప్రాయపడ్డారు. యావత్ మానవాళిపై తీవ్ర ప్రభా వం చూపే పర్యావరణ మార్పులు, శిలాజ ఇంధనాల వాడకంపై తీవ్రం గా ఆధారపడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. హెర్డ్ ఇమ్యునిటీ సాధించే దాఖలాలు ప్రస్తుతం భారత్లో సమీ ప భవిష్యత్లో కనిపించడం లేదన్న ఆయన, వైరస్ దరిచేరకుండా ఉం డేందుకు మాస్కులు, భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూ చించారు. కరోనా వైరస్ ముప్పు తొలగిపోయిందని నిర్లక్ష్యం చేస్తే మూడో ముప్పు (థర్డ్ వేవ్) వల్ల భారత్ ఇప్పటివరకు ఎదుర్కొన్న సవాళ్ల కంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. భారత్లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్తర కం కరోనాపైనా పనిచేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కొత్తర కంపై పనిచేయవని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు ప్రస్తుతం లేవ నీ, వ్యాక్సిన్లసామర్థ్యంపై నమ్మకముంచాలని స్పష్టం చేశారు.