Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 6.80 శాతమే
- ప్రాసెసింగ్ ఫీజు రద్దు : ఎస్బిఐ ఆఫర్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) గహ కొనుగోలుదారులకు అత్యంత చౌక వడ్డీ రేటులో రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాదికి అతితక్కువ 6.80 శాతం వడ్డీతో గహ రుణాలను ఆఫర్ చేస్తోన్నట్లు సోమవారం వెల్లడించింది. ఎస్బిఐ ఆమోదించిన ప్రాజెక్టులకు 2021 మార్చి 31 వరకు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. దీంతో మొత్తం రుణంపై 1 శాతానికి కన్నా ఎక్కువ ఆదా కానుంది. ఖాతాదారులు పొందే రుణ మొత్తంపై ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా 0.8 శాతం నుంచి 1 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.30 లక్షల రుణం పొందాల్సి ఉంటే ప్రాసెసింగ్ ఫీజు రూ.24వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుపైనా 100 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపింది.
మహిళలకు మరింత తగ్గింపు
గృహ కొనుగోలుదారు రూ.75 లక్షల వరకు రుణం పొందితే 6.70 శాతం వడ్డీ, 75 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు రుణ మొత్తంపై 6.75 శాతం వడ్డీ వర్తిస్తుందని ఎస్బిఐ పేర్కొంది. సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయం ఉంటుందని ఆ బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా ఎస్బిఐ యోనో యాప్ ద్వారా గృహ రుణం తీసుకుంటే మరో 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఎస్బిఐ బ్యాంకు గహ రుణ పోర్ట్ఫోలియో ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. 2024 కల్లా దీనిని రూ.7 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీలాంటి ఆఫర్లు ఇస్తోన్నట్లు ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటాను కలిగి ఉంది. అత్యంత పోటీ పద్దతిలో చౌక వడ్డీ రేట్లతో గృహ రుణాలు అందిస్తోన్న ఎస్బిఐ వచ్చే ఐదేళ్లలో ఈ పోర్టుపోలియోలో రెట్టింపు వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుంది.