Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : కరోనా మహమ్మారితో మధ్యప్రదేశ్ బిజెపి ఎంపి నందకుమార్ సింగ్ చౌహాన్ మంగళవారం మరణించారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఎంపీ మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. 2009-14 మధ్య ఐదేండ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు.