Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జియో రూ.57,123 కోట్లతో బిడ్డింగ్
న్యూఢిల్లీ : రెండు రోజుల పాటు నిర్వహించిన టెలికం స్పెక్ట్రం వేలం మంగళవారంతో ముగిసింది. మొబైల్ కాల్స్, డాటా సిగల్స్ 4జికి సంబంధించిన ఈ వేలంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అత్యధికంగా రూ.57,123 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం కొనుగోలుకు బిడ్డింగ్ వేసింది. మరో టెలికం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ రూ.18,699 కోట్లతో 355.45 మెగాహెడ్జ్ (ఎంహెచ్జడ్) కోసం ఆసక్తి చూపింది. వొడాఫోన్ ఐడియా రూ.1,993.40 కోట్ల స్పెక్ట్రం కొనుగోలుకు ముందుకు వచ్చింది. గత ఐదేళ్లలో రేడియో తరంగాలకు జరిగిన తొలి వేలం. రెండో జరిగిన 855.60 ఎంహెచ్జడ్ వేలంలో రూ.77,814.80 కోట్ల ఆదాయం సమకూరుతుందని టెలికం శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఈ సారి వేలంలో కేవలం ఎయిర్టెల్, విఐ, రిలయన్స్ జియో మాత్రమే భాగస్వామ్యం అయ్యాయి. 2016లో జరిగిన బిడ్డింగ్లో ఏడు కంపెనీలు స్పెక్ట్రం కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది 4జికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 700 ఎంహెచ్జడ్, 800 ఎంహెచ్జడ్, 900 ఎంహెచ్జడ్, 1800 ఎంహెచ్జడ్, 2100 ఎంహెచ్జడ్, 2300 ఎంహెచ్జడ్, 2500 ఎంహెచ్జడ్ బాండ్లకు వేలం వేసింది. ఈ స్పెక్ట్రాన్ని ఆయా కంపెనీలు 20 ఏళ్ల పాటు ఉపయోగించకోవడానికి వీలుంది.