Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎస్ కుమార్ కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ సెక్రటరీగా ఆయనకు అవకాశం కల్పించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు లాల్ సింగ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత జేపీ నడ్డా సమ్మతితో వీరిని ఎంపిక చేసినట్టు తెలిపారు. మొత్తం 22 మంది తో కూడిన బిజేపి షెడ్యూల్డ్ కాస్ట్ మోర్చా జాబితాను ఆయన ప్రకటించారు. ఏడుగురు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు, ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు జాతీయ కార్యదర్శులు, మరో ఐదుగురిని వివిధ పదవుల్లో నియమించింది. ఇందులో తెలంగాణ నుంచి కరీంనగర్ కు చెందిన ఎస్ కుమార్ కు పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించింది. కాగా, గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎస్ కుమార్ పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే.