Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలకు కమిటీలు వేసిన కాంగ్రెస్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేరళ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును నియమించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి కి ఏఐసీసీ మంగళవారం స్క్రీనింగ్ కమిటీలను వేసింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్నికల కమిటీలను నియమించినట్టు లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి కలిపి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజరు సింగ్, కేరళ కు హెచ్ కె పాటిల్ల ను స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ కమిటీల్లో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు, ఐదుగురు ఎక్స్ అఫిషియో మెంబర్లకు అవకాశం కల్పించింది.