Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజాద్ దిష్టిబొమ్మ దగ్ధం
జమ్ము : పార్టీవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించినందుకు నిరసనగా జమ్ములో గులాంనబీ అజాద్ దిష్టిబొమ్మను మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. ''కాంగ్రెస్ను బలహీనం చేయడంలో బిజెపి ఆదేశాల ప్రకారమే అజాద్ జమ్ములో కాంగ్రెస్ అసమ్మతి నేతలతో(జి-23) ఒక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన మోడీని ప్రశంసించారు' అని నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అజాద్ను ఎల్లప్పడూ ఉన్నత స్థానంలో ఉంచిందని, పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో అజాద్ తన అనుభవాన్ని పార్టీని పునర్జీవనం కోసం ఉపయోగించాలీ కానీ, బలహీనం చేయడానికి కాదు అని అన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై పోరాటం చేస్తామని నిరసనల్లో పాల్గొన్న నేతలు తెలిపారు.