Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రైతులు, కార్మికుల పట్ల అహంకార వైఖరిని అవలంభిస్తున్న బీజేపీని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చిత్తుగా ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్కేయూ) పిలుపునిచ్చింది. ఈ ఎన్నికల్లో రైతులు, కార్మికులు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని సూచించింది. దాంతోపాటు, ఆయన సాగు వ్యతిరేక చట్టాలపై ఉద్యమ కార్యాచరణను ఎస్కేయూ ప్రకటించింది. రైతులు పండించిన పంటకు కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ) మిలావ్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతామని వెల్లడించారు. ఆ సంఘం నేతలు మంగళవారం ఢిల్లీ సరిహద్దులోని సింఘులో భేటీ అయ్యారు. అనంతరం రైతు నేతలు మీడియాతో మాట్లాడారు. మార్చి 15 వరకు కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసినట్టు తెలిపారు. మార్చి 6 నాటికి రైతాంగ పోరాటం 100 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని కుండ్లి-మనేసర్-పల్వాల్(కేఎంసీ) ఎక్స్ప్రెస్ వేను దిగ్భంధనం చేస్తామన్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దిగ్బంధనం చేయాలని పిలుపునిచ్చారు. దాంతోపాటు, దేశవ్యాప్తంగా రైతులంతా తమ ఇండ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని సూచించారు. మార్చి 5న కర్నాటకలో ఎంఎస్పీ దిలావ్ పేరుతో ఉద్యమం చేస్తామన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షా స్థలాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములవుతారని చెప్పారు. 10 నుంచి 15 వరకు కార్మికులు, ఉద్యోగులు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. మోడీ సర్కారు ఈ చట్టాలను రద్దు చేసేదాకా ఉద్యమం విరమించేదిలేదని దర్శన్ పాల్ హెచ్చరించారు.