Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణతో పాటు 20 రాష్ట్రాలు, యూటీల్లో కొనుగోల్లు
- గతేడాదితో పోల్చితే 15.31 శాతం సేకరణ పెరిగిందన్న కేంద్రం
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(కేఎంఎస్) 2020-21 లో తాజా మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రకారం రైతుల నుంచి కోనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 668.12 ఎల్ఎంటీ వరిని కొనుగోలు చేసినట్టు తెలిపింది. తెలంగాణతో పాటూ, పంజాబ్, హర్యానా, యూపీ, ఉత్తరఖండ్, తమిళనాడు, చండీగడ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్, అసోం, కర్నాటక, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, త్రిపుర నుంచి వరి ధ్యాన్యాల సేకరణ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ బుధవారం మీడియాకు వెల్లడించింది. గత ఏడాది 579.41 ఎల్ఎమ్టీ కొనుగోలుతో పోలిస్తే ఈసారి 15.31 శాతం పెరుగుదల ఉందని స్పష్టం చేసింది.
మొత్తం 668.12 ఎల్ఎమ్టి కొనుగోలులో, పంజాబ్ నుంచే 202.82 ఎల్ఎమ్టీ అందిందని చెప్పింది. ఇది మొత్తం సేకరణలో 30.35 శాతంగా ఉందని వెల్లడించింది. కేఎంఎస్ సేకరణలో ఇప్పటికే సుమారు 97.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్టు అధికారులు తెలిపారు. ఈ మొత్తం మద్దతు ధర విలువ రూ. 1,26,141.16 కోట్లు గా స్పష్టం చేసింది. అలాగే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా రాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా 85.08 ఎల్ఎంటీ పల్స్, ఆయిల్ సీడ్స్ కొనుగోలుకు అనుమతి ఇచ్చినట్టు వివరించింది. ప్రైజ్ సపోర్ట్ స్కీం(పీఎస్ఎస్) కింద మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్ఎమ్టీ కొప్రా (శాశ్వత పంట) సేకరణకు అనుమతి ఇచ్చామని వెల్లడించింది.