Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హ్యాండ్లూమ్, జ్యూట్ బోర్డుల రద్దు
- జాబితాలో మరిన్ని.. ప్రయివేటీకరణలో భాగం
న్యూఢిల్లీ : బడా వ్యాపారుల వంత పాడటానికి ప్రయివేటీకరణను తలకెత్తుకున్న మోడీ సర్కార్ పలు ప్రభుత్వ శాఖలను మూసేస్తున్నది. వ్యాపారాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను, శాఖలను క్రమంగా రద్దు చేయాలని నిర్ణ యించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీ వ్ సన్యాల్ తెలిపారు. ఇప్పటికే జ్యూట్ అడ్వైజరీ బోర్డ్, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డులను మూసివేసిందని వెల్లడించారు. భారత్ ఛాం బర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సన్యాల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని శాఖలను రద్దు చేయనున్నట్టు తెలిపారు. కనీస ప్రభుత్వం.. గరిష్ట గవర్నెన్స్ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నదన్నారు.
పెట్టుబడిదారుల కోసం డీఎఫ్ఐ
కేంద్ర ప్రభుత్వం 100శాతం నిధులతో న్యూ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్ట్యూషన్ (డీఎఫ్ఐ)ని ఏర్పాటు చేయనుందని శ్యాముల్ తెలిపారు. అనంతరం ఇందులో ప్రయివేటు వాటాదారుల (స్టేక్ హోల్డర్ల)కు భాగస్వామం కల్పించనున్నామన్నారు. ఈ సంస్థ ప్రయివేటు రంగ పెట్టుబడిదారుల అవసరాలను తీర్చనుందన్నారు. తక్కువ పన్నులతో ప్రయివేటు రంగానికి మద్దతు చేయడాన్ని తాము సంతోషంగా భావిస్తు న్నామన్నారు. 2021-22లో దేశ జీడీపీ 14.5 శాతం పెరుగొచ్చని.. ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన రంగంపై దృష్టి సారించడం ద్వారా ఉపాధి కల్పన పెంచాలని నిర్దేశించుకుందన్నారు.