Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువశక్తికి దక్కని ఉపాధి.. చిన్న ఉద్యోగాలూ గగనమే
- డిగ్రీలు చేతపట్టుకుని వెతుకులాట
- ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేస్తుంటే.. సర్కారీ నౌకరీ కలే..
- కుటుంబ ఖర్చులకు తోడు ఉపాధిలేని బిడ్డలపై తలిదండ్రుల బెంగ
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా.. మేం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తాం. - 2014 ఎన్నికల ప్రచారంలో మోడీ
గద్దెనెక్కటానికి ముందు నిరుద్యోగం.. ఉపాధి సమస్యలనే ప్రస్తావించిన మోడీ సర్కార్ అధికారంలోకి రాగానే కార్పొరేట్ల సేవలో తడిచిముద్దవుతున్నది. పెద్దల మెహర్బానీ పొందితే వచ్చే లాభాల(పార్టీ విరాళాలు...ఇతరత్రా)వైపు దృష్టిపెడుతున్నది. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే.. పైసా ప్రయోజనం ఉండదన్న భావనలో ఉన్నట్టుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగహామీని లెక్కేస్తే.. సుమారు 12 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉండాలి. కానీ అది జరిగిందా..? అంటే లేదన్నట్టు డిగ్రీ పట్టాలు పట్టుకున్న యువత రోడ్లపై కనిపిస్తున్నారు. ఓ వైపు జీడీపీ పెరుగుతున్నదని కేంద్రం ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగులకు ఉపాధి చూపటంలో మాత్రం మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నది.?
న్యూఢిల్లీ : ఏటా రెండుకోట్లమందికి ఉద్యోగాలిస్తామన్న మోడీ మాటలు నీటి మూటలయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థల్ని రిటైల్గా.. హౌల్సేల్గా అమ్మేస్తానంటూ దేశప్రధాని చెబుతూనే ఉన్నారు. ఎన్నో ఆశలతో అధికారాన్ని కట్టబెట్టిన యువత ఇప్పుడు ఏ చిన్న ఉద్యోగం దొరికినా చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఇటీవల చవీశీసఱబి=శీఓస్త్రaతీబిణశీ ట్విట్టర్ లో అగ్ర భాగాన నిలిచింది. సుమారు 25 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ఈ హ్యాష్ట్యాగ్ను ట్రెండింగ్ చేయడానికి ప్రధాన కారణం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఫలితాల్లో విద్యార్థుల అసంతృ ప్తికి కారణమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్ఎస్సీ కాకుండా ఇతర ఉద్యోగాల్లో నియామకం గురించి ప్రదర్శనలు హౌరెత్తించాయి. ఈ ఆందోళనలు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు అద్దంపడుతున్నాయి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం 2019-20లో దేశంలో సుమారు 40.35 కోట్ల మందికి ఉపాధి ఉన్నదనీ, సుమారు 3.5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా.ఇక ప్రతి ఏటా కోటి మంది వరకూ ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్టు ధ్రువీకరించింది. అధికారంలోకి రాకముందు ప్రధానిమోడీ ప్రతి ఏటా రెండుకోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అలా జరగలేదు. 2016-17 నుంచి దేశంలో ఉపాధి కల్పించుకుంటున్న వారి సంఖ్య పెరగటంలేదు. అది కాస్త క్రమంగా తగ్గుతూనే ఉన్నది. ఈ గణాంకాలను భారతీయ ఆర్థిక వ్యవస్థతో కలిపితే, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నా, ఉపాధి నెమ్మదిగా తగ్గుతోందని స్పష్టమవుతున్నది..
కరోనాకు ముందు..తర్వాత ఉపాధి గల్లంతు
కోవిడ్ -19 కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఉపాధి మరింత ప్రమాదకరంగా మారింది. దేశంలో గత ఒక్క ఏడాదిలోనే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2019-20 చివరి నాటికి దేశంలో 3.5 కోట్ల మంది నిరుద్యోగులుగా మారడానికి ప్రధాన కారణమైనట్టు సీఎంఐఈ గుర్తించింది. కానీ గత కొన్ని నెలల్లో నిరుద్యోగుల సంఖ్య నాలుగు కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల మధ్యకు చేరింది. ఉపాధిలేక రోడ్డున పడ్డ వారి కుటుంబాలెన్నో దుర్భరజీవితాలను గడుపుతున్నట్టు నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. ఉపాధికోల్పోయిన వారే కాకుండా.. మరో నాలుగున్నర కోట్ల మంది నిరుద్యోగులు ఉపాధి దొరక్క నానాఅవస్థలు పడుతున్నారని తేలింది. తమ వద్ద నైపుణ్యం(స్కిల్) ఉన్నా పని దొరకటంలేదు. మరోవైపు నిరుద్యోగం భారత్లో ఎక్కువగా ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. 2017..18లో నిరుద్యోగ రేటు 6.1 శాతముంటే..45 ఏండ్లలో ఇది అత్యధికమని సీఎంఐఈ ప్రకటించింది. ప్రస్తుతం నిరుద్యోగ రేటు 7శాతానికి అటుఇటుగా ఉన్నదంటే...ఉపాధి సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతున్నది.
యువత ఎక్కువగా ఉన్నా..శ్రామికశక్తిగా మార్చటంలో వెనుకంజే..
దేశంలో పెద్ద సంఖ్యలో యువ జనాభా ఉన్నది, కానీ శ్రామిక శక్తిగా మలచటంలో మోడీ ప్రభుత్వం విఫలమవుతున్నదనే వాదన ఉన్నది. దేశంలో పెద్ద సంఖ్యలో మానవ వనరులు ఉన్నాయనీ పాలకులు చెబుతుంటారు. కానీ 15-59 ఏండ్ల మధ్య వయస్సులో ఉన్న రెండు కోట్ల మందిలో 40 శాతం మంది మాత్రమే ఉపాధి వేటలో ఉంటున్నారు. ఉద్యోగార్ధుల రేటును లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్ఎఫ్పీఆర్) అంటారు. ఇక్కడ ఎల్ఎఫ్ఫ్పీఆర్ కేవలం 40 శాతముంటే.. అభివృద్ధి చెందిన దేశాలలో 60 శాతం..మనదేశంలో ఇంత తేడా ఉండటానికి ప్రధాన కారణం పెద్ద సంఖ్యలో మహిళలకు ఉపాధి లేకపోవడంతో పాటు..ఉన్న ఉపాధి కోల్పోయి వారు కొత్త ఉద్యోగాల కోసం ఉరుకులు పరుగులు పెట్టక తప్పటంలేదు. ' పట్టణ హామీ పథకం కింద విద్య..శిక్షణే సరైన మందు ఉపాధి సమస్యను పరిష్కరించడానికి 'పట్టణ ఉపాధి హామీ' వంటి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ సూచిస్తున్నారు. విద్య,నైపుణ్యం ఇవ్వగలిగితే నిరుద్యోగ సమస్యను తీర్చవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా ఉపాధిహామీ చట్టం కింద ఉపాధి కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తుంటే మోడీ ప్రభుత్వం నిదులకు కోతపెడుతున్నది. దీంతో గ్రామీణ, పట్టణాల్లో నిరుద్యోగం గణనీయంగా పెరుగుతున్నది.
తగ్గిన విద్య బడ్డెట్ కేటాయింపులు..ఉపాధి కల్పించని స్కిల్ ఇండియా
విద్యాబడ్జెట్ తగ్గిపోయింది. స్కిల్ ఇండియా కింద శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు రాలేదని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ధ్రువీకరించింది. 2023 నాటికి ఆరుకోట్ల మంది శ్రామిక శక్తిలో చేరనున్నా రని అంచనా వేసింది. ఇప్పటికే నైపుణ్యం ఉన్నవారికి తిరిగి నైపుణ్యం అవసరమంటున్నది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వటం మినహా..వాటివల్ల ఒరిగిందేమీలేదని నిరుద్యోగ సంఘాలు అంటున్నాయి.
వాస్తవమేదీ..?
స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ వెబ్సైట్లో శిక్షణ పొందుతున్న వారిలో 54 శాతం మందికి ఉపాధి లభించిందని వెబ్సైట్ పేర్కొంది. అయితే 2019-20 తుది నివేదిక ప్రకారం డిసెంబర్ 31, 2019 పీఎంకెేవీవై సర్టిఫికెట్ పొందిన వారి సంఖ్య అక్షరాల 3,81,131. అందులో 1,09,729 మందికి(29శాతం) మాత్రమే ఉపాధి దొరికినట్టు సైట్లో ఉంచారు,
పారదర్శకత లోపించిన ఉపాధి డేటా
'అమెరికాలో, ప్రభుత్వానికి వివిధ రంగాలలో ఉపాధికి సంబంధించిన తాజా గణాంకాలు అందుబాటులో ఉంటాయి. దీని ఆధారంగా.. ఏ రంగంలో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఆ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి ప్రభుత్వమే ఉద్యోగం కల్పిస్తుంది. కానీ భారత్ అలాంటి ఉపాధి డేటా పారదర్శకంగా లేదు .ఇప్పటికీ నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా మారుతున్నా...స్పష్టమైన వివరాలు అందుబాటులోలేకపోవటం విచారకరం.
- ఎకనామిక్ జర్నలిస్ట్ సిషిర్ సిన్హా
నిన్న మొన్నటివరకు నిరుద్యోగం గురించి మాట్లాడిన మోడీ ప్రభుత్వం ఇపుడు రామమందిరం అనో..మరోకటో చెప్పి రాజకీయం చేయటానికి రెడీ అయిపోయింది. ఎంతో కష్టపడి తమ బిడ్డల్ని చదివించి డిగ్రీలిప్పిస్తే...ఉద్యోగంలేదు. ఉపాధీ లేదు. చదివిన చదువుకు ఎలాంటి సంబంధంలేని పనిలోనైనా చేరుతామంటుంటే..కొందరికే ఆ ఉపాధి దక్కుతున్నది. ఎదిగిన బిడ్డకు పనిలేదని ఆందోళన చెందుతుంటే.. పెరుగుతున్న కుటుంబ ఖర్చులకు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు..