Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాప్సీ, కశ్యప్ నివాసాల్లో ఐటీ దాడులపై ఎస్కేయూ ఆగ్రహం
- ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం
- మోడీ సర్కారుది నిరంకుశ నాజీల వైఖరి : తేజస్వీ యాదవ్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడుతున్న వారిని కేంద్ర ప్రభుత్వం పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదనీ, ఇది ఎంతమాత్రం సరికాదని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. రైతుల చట్టబద్ధమైన డిమాండ్లను నెరవేర్చడానికి బదులుగా అన్నదాతలను వారి మద్దతుదారులను
వేధించడానికి మోడీ ప్రభుత్వం మార్గాలను అన్వేషించడం ఖండిం చదగ్గ విషయమని పేర్కొంది. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినప్పటికీ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తన ఉధృతిని పెంచుకుంటున్నదనీ తెలిపింది. ఇది హర్షణీయమైనదని స్పష్టం చేసింది. చాలామంది జాతీ య, అంతర్జాతీయ ప్రముఖులు రైతుల ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నారని గుర్తు చేసింది. అందులో సినీనటి తాప్సీ, అనురాగ్ కశ్యప్ వంటి సినీ ప్రముఖులు ఉన్నారనీ, వారిపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయటాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. ఐటీ దాడులు, దేశద్రోహ కేసులతో రైతు ఉద్యమ గొంతులని ఆపలేరని హెచ్చరించింది. తమని ఎంతస్థాయిలో అణచివేస్తే మరింత అధికంగా తాము పైకి లేస్తామని వెల్లడించింది. సాగు చట్టాలపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కేయూ) సన్నద్ధమైంది. అందులో భాగంగా ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కసరత్తులు ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో గల ఘాజీపూర్, టిక్రీ, సింఘు సరిహద్దులన్నింటినీ హస్తినా పోలీసులు మూసివేశారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో గల ఘాజీపూర్, టిక్రీ, సింఘు సరిహద్దులన్నింటినీ హస్తినా పోలీసులు మూసివేశారు.