Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఢిల్లీ వాసులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం సీఎం కేజ్రీవాల్ తన తల్లిదండ్రులతో కలిసి వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జరు ప్రకాశ్ (ఎల్ఎన్ జేపీ) ఆస్పత్రిలో నర్సులు సీఎం తండ్రి గోబింద్ రాం కేజ్రీవాల్, తల్లి గీతా దేవిలకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ''నా తల్లిదండ్రులతో కలిసి వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాను. వ్యాక్సినేషన్ తర్వాత మాకు ఎలాంటి సమస్య రాలేదు. మేము ఆరోగ్యంగానే ఉన్నాం''అని వెల్లడించారు. కరోనాను జయించే దిశలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు. ఎలిజిబుల్ పర్సెన్స్ కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. టీకా పై ప్రజల్లో ఇకపై ఎలాంటి డౌట్లు ఎక్కువ కాలం ఉండవన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఎల్ఎన్ జేపి ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 132 ప్రయివేటు ఆస్పత్రులతో కలిపి మొత్తం 192 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో టచ్లో ఉన్నామన్న ఆయన, అవసరమైతే వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచుతామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.