Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం భారత ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు, రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కొందరు కేంద్ర మంత్రులు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు (కెఐఎఫ్బీ)కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన ఒక రోజు తరువాత ఎన్నికల సంఘానికి విజయన్ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయంగా తటస్థంగా ఉండేలా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈడీ అధికారులు మీడియాకు సమాచారాన్ని లీక్ చేస్తూ.. మీడియా హడావిడి చేయడం పక్షపాత రాజకీయాలన ప్రేరేపించవచ్చని తెలిపారు. నిర్మల ప్రసంగం సైతం ఎన్నికల కోడ్ నియమావళికి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పనిచేస్తుందనీ, రాష్ట్రంలో ఏప్రిల్ 6 జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియా ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఈడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.