Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మంత్రిపై దాడి
అగర్తల : త్రిపురలో బీజేపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయా రు. అధికార మదంతో వామపక్ష కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత, కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ మంత్రి బాదల్ చౌదరిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన గాయపడినట్టు సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కమిటీ వెల్లడించింది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది. దక్షిణ త్రిపుర జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సీపీఐ(ఎం) తెలిపింది. అగర్తలకు 110 కిలోమీటర్ల దూరంలోని మణిరంపారా గ్రామంలో కోక్బోరోక్ భాషా ఉద్యమ నేత ధనంజరు త్రిపుర వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన చౌదరిపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాగా, దాడిని ఖండిస్తూ అగర్తలలో సీపీఐ(ఎం) గురువారం భారీ ర్యాలీ నిర్వహించింది.