Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘాజీపూర్లో రైతాంగ పోరు
- తెలంగాణ సీపీఐ నేత విజయ భాయి సంఘీభావం
న్యూఢిల్లీ:వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు విరోచితంగా ఉద్యమం చేస్తున్నారని తెలంగాణ సీపీఐ నేత భానోత్ విజయ భాయి నన్నారు. అయితే, వారి ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒంటెత్తు పోకడలకి పోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహౌన్నతంగా జరుగుతున్న ఈ రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకమని చెప్పారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో గల ఘాజీపూర్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం విజయ మీడియాతో మాట్లాడుతూ... మోడీ సర్కారు అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ఈ మూడు రైతు చట్టాలు భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశాలని ఆమె గుర్తు చేశారు. అందుకే ఇవి రాజ్యాంగ వ్యతిరేకమని రైతులు చెబుతున్నానని అన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశాలపై కేంద్రం ఏకపక్షంగా చట్టాలు చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు స్వేఛ్చ ఉందని, దళారుల వ్యవస్థ లేదని కేంద్రం చెబుతోందన్నారు. ఇది పూర్తిగా అబద్ధమని, ఇప్పటికే ఆ స్వేచ్ఛ రైతులకు ఉందని స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాల్లో ప్రయివేటు మార్కెట్లు ఉన్నాయని, అయినప్పటీకి ఆ రాష్ట్రాల్లో ప్రయివేటు పెట్టుబడులు అందులోకి ప్రవేశించలేదన్నారు. బీహార్ రాష్ట్రమే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని, అక్కడ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను లారీల్లో తీసుకొచ్చి పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో ప్రయివేటు వ్యక్తులు అమ్ముకు ంటున్నారని వివరించారు. నిత్యావసర సరకుల చట్టంలో నిల్వ పరిమితి పై ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ ఈ చట్టాలు కావాలని అడగలేదని, సాగు రంగంలో నూతన కార్పొరేట్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకే ఈ చట్టాలు విజయ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వీటిని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, రాష్ట్ర ప్రభుత్వ మరోసారి సంప్రదింపులు జరిపి వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు. తాజా చట్టాల కారణంగా భూ యజమానులు తమ పోలాల్లోనే కూలీలుగా మారుతారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 12.08 శాతం భూమి మాత్రమే మహిళల పేరు మీద ఉందని గుర్తు చేశారు. ప్రస్తుత చట్టాలతో వారు భూములు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం దక్కే అవకాశం లేదని గుర్తు చేశారు. శ్రామికులు పూర్తిగా పనులకు దూరమవుతారన్నారు.