Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుమార్తె తల నరికిన తండ్రి
- తలను చేతిలో పట్టుకుని గ్రామంలో తిరుగుతూ..
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ దేశంలో నేరాలకు అడ్డాగా మారింది. నిత్యం అతి క్రూరమైన నేరాలు వెలుగు చూస్తున్న యూపీలో మరీ ముఖ్యంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. నిత్యం కొనసాగుతున్న నేరాల పరంపరలో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. అతి క్రూరంగా ఓ తండ్రి కన్నకూతురి (17 ఏండ్లు) తల నరికాడు. అనంతరం తలను చేతిలో పట్టుకుని గ్రామ రోడ్లపై తిరిగాడు. ఈ దారుణ ఘటన హార్దోయి జిల్లాలోని పండెతరా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పండెతరా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి.. నరికేసిన ఓ తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు. ఈ తల ఆయన కుమార్తెదేనని గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ''తొలుత నిందితుడి పేరు అడిగి.. ఈ తల ఎవరిది అని ప్రశ్నించగా.. ఏ మాత్రం సంకోచించకుండా అది తన కూతురుదనీ, హత్య చేసింది తానేనని చెప్పాడు. తల తన దగ్గర ఉందనీ, మిగతా శరీరం ఇంట్లో ఉందన్నాడు. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం భరించలేకే హత్య చేశానని సర్వేశ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, యూపీలో క్రైమ్ రేటు అధికంగా పెరుతోందని గణాంకాలు పేర్కొంటున్నాయి. 2019లో మహిళలపై అత్యధిక నేరాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో యూపీ అగ్రస్థానంలో ఉందని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. అలాగే మైనర్లపై జరుగుతున్న దాడులు అధికంగా ఉంటున్నాయి. యూపీలో అత్యధికంగా 7,444 పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లు ఉన్నాయి.