Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్కు మాజీ ఎంపీ మధుయాష్కి వివరణ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పోయినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ కాంగ్రెస్ హైకమాండ్కు సూచించారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఢిల్లీలోని జన్ పథ్ 10 లో రాహుల్ గాంధీతో మధు యాష్కీ ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు సాగిన భేటిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని, అన్ని వర్గాల ముద్ర పార్టీలో ఉండేలా ప్రణాళిక చేయాలని రాహుల్ దష్టికి తీసుకెళ్లారు. ఆ దిశలో సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారని, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అప్ డేట్ను అడిగి తెలుసుకున్నట్టు యాష్కీ మీడియాకు చెప్పారు. తమ సూచనలు, సలహాలపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందిచారని, ఇతర పొలిటికల్ ఇష్యూపై చర్చజరిగిందని తెలిపారు.